చెక్ పోస్ట్‌ ఆకస్మిక తనిఖీ చేసిన సెబ్ అసిస్టెంట్ కమిషనర్

by Disha Web Desk 18 |
చెక్ పోస్ట్‌ ఆకస్మిక తనిఖీ చేసిన సెబ్ అసిస్టెంట్ కమిషనర్
X

దిశ ప్రతినిధి,జగ్గయ్యపేట: మండలంలోని గరికపాడు బార్డర్ చెక్ పోస్ట్‌ను,ఏపి రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కమీషనర్ వారి ఆదేశాల మేరకు జోన్ 2 పరిధిలో గల మంగళగిరి,అసిస్టెంట్ కమీషనర్ కె.విజయ ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. వారు తనిఖీలో భాగంగా వాహనాలతో పాటు ప్రత్యేకంగా వోల్వా బసును ఆపి లాగేజీని చెక్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం కోసం బార్డర్ లో ఎన్నికల అధికారి ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని,బార్డర్ చెక్ పోస్ట్ నుంచి అక్రమ మద్యం, గంజాయి, నగదు, వెండి, బంగారం, గిఫ్ట్ ఆర్టికల్స్ లను తరలించడం పై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి,కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ సీఐలు మణికంఠ రెడ్డి,శ్రీధర్,జియస్టి అధికారి బషీరుద్దీన్,ఫారెస్ట్ అధికారి ప్రసన్న లీలా,చిల్లకల్లు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రవి,యస్.యస్.టి టీం వెంకట్రామయ్య, కానిస్టేబుల్ శివ నాగరాజు, రవాణా శాఖ పిజె సురేష్ కుమార్,యం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed